కేసీఆర్ గ్రాండ్ గిఫ్ట్ : మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు!

గురువారం, 2 అక్టోబరు 2014 (16:27 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో సీట్లు పెంచాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కూడా ఆయన తన లేఖలో మోడీని కోరారు. 
 
చట్టసభల్లో ఓబీసీలకు కూడా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, వారి కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఈ మూడు అంశాలపై తెలంగాణ శాసనసభ, శాసనమండలి ప్రత్యేక తీర్మానం చేసి ఆమోదించిందని కూడా ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి