లోకేష్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలం.. కేఈ కృష్ణమూర్తి!

సోమవారం, 20 ఏప్రియల్ 2015 (18:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేష్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆకాశానికెత్తారు. ఇదే అంశంపై ఆయన సోమవారం మాట్లాడుతూ లోకేష్‌లో మంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటున్నారన్నారు. అందువల్ల ఆయన వీలైనంత త్వరగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్‌ ఎంతగానో కష్టపడుతున్నారంటూ కితాబిచ్చారు. 
 
ఇటీవల చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. తాము కూడా ఓ నాయకుడిని తయారు చేసుకోవాలని అనుకుంటున్నామని, లోకేష్‌లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఆయన అన్నారు. నారా లోకేష్‌పై ప్రజలకు విశ్వాసం ఉందని, సంక్షేమ యాత్ర విజయవంతమైందని, పార్టీ సభ్యత్వాన్ని 50 లక్షలకు పెంచారని ఆయన అన్నారు. 

వెబ్దునియా పై చదవండి