భర్త అడ్డుతొలగిస్తే.. పిలిచినపుడల్లా వస్తుంటా... ప్రియుడి మోజులో భార్య

శనివారం, 8 సెప్టెంబరు 2018 (12:47 IST)
భర్త అడ్డు తొలగిస్తే నీవు పిలిచినపుడల్లా వచ్చి సుఖాన్ని ఇస్తుంటా అని తన ప్రియుడుకి ఓ వివాహిత ఆఫర్ ఇచ్చింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఆమె భర్తను గొడ్డలితో నరికి చంపేశారు. ఈ దారుణం కర్నూలు జిల్లా వెల్దుర్తిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మండలంలోని ఎస్‌.బోయినపల్లి గ్రామానికి చెందిన మంగలి శివరాముడు(40)కు భార్య లక్ష్మీదేవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శివరాముడు గ్రామంలో కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే భార్య లక్ష్మీదేవి అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఏర్పడింది.
 
ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో ఆమెను హెచ్చరించాడు. ఇకలాభం లేదని భావించిన లక్ష్మీదేవి.. తన ప్రియుడితో కలిసి భర్త శివరాముడు హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం రచించిన పథకం మేరకు శుక్రవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న శివరాముడి తలపై గొడ్డలితో దాడి చేసి చంపేశారు. 
 
దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు భార్య లక్ష్మీదేవి ప్రయత్నించింది. బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా హత్య చేసినట్లు లక్ష్మీదేవి, రామకృష్ణలు నేరాన్ని అంగీకరించారు. దీంతోవారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు