పందుల ఆటలు ఆడుకోమని సుజనా వ్యాఖ్యలు తప్పే.. పవన్ పొలిమేర దాటలేదా?

శుక్రవారం, 27 జనవరి 2017 (11:06 IST)
జల్లికట్టు స్ఫూర్తితో పందుల ఆటలు ఆడుకోమంటూ సుజనా చేసిన కామెంట్స్ తప్పేనని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకుంటామని ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్ టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. సుజనా చౌదరి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టలేదని చెప్పారు. 
 
పవన్ రాజధాని సమస్యలు, ఉద్దానం సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని ఉమా చెప్పారు. సుజనా చౌదరి, రాయపాటిపై పవన్ వ్యాఖ్యలు సరికాదని ఉమా అభిప్రాయపడ్డారు. వారిద్దరిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని బొండా ఉమ స్పష్టం చేశారు.
 
ఇదిలా ఉంటే.. జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్‌లో సునామీ గ్యారంటీ అంటూ.. వారం రోజుల్నుంచీ ట్వీట్లతో దంచి కొడుతున్న పవన్ కళ్యాణ్.. ఆర్కే బీచ్‌కు రాలేకపోయారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న 'కాటమరాయుడు' షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ బిజీగా వున్నారని ఫిలిం సర్కిల్స్‌కి అందిన పక్కా సమాచారం. హైదరాబాదు పొలిమేర కూడా పవన్ దాటలేదు. దీనిపైనా విమర్శలొస్తున్నాయి. జనసేనాని వచ్చివుంటే తప్పకుండా యువత పూర్తి మద్దతు తెలిపేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి