ఏపీ సీఎంకు పంచ్ విసిరిన మహేష్ బాబు.. ఏమన్నారు..?

మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:18 IST)
ఏపీలో రాజధాని అమరావతి అంశం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో పాటు ప్రజా సంఘాలన్నీ అమరావతికి మద్దతుగా నిలుస్తున్నాయి. టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ అమరావతి రైతులకు మద్ధతుగా నిలుస్తున్నారు. పోరాటంలో భాగస్వామ్యులవుతున్నారు.
 
గత కొన్నిరోజులకు ముందు గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కూడా ఆందోళన చేస్తుంటే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్ళారు. దీంతో ఆయన చొక్కా సైతం చినిగిపోయింది. ప్రభుత్వంపై కక్ష్యసాధింపుతో వ్యవహరిస్తోంది మండిపడ్డారు గల్లా జయదేవ్.
 
ఇదంతా ఒకే. అయితే ఎప్పడూ రాజకీయం గురించి మాట్లాడని మహేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. మీరు ఒకరోజు సీఎం అయితే ఏం చేస్తారని ప్రశ్నిస్తే నాకు తెలియదన్న మహేష్ బాబు... ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని చెప్పాడు.

ఇది కాస్త అధికార పార్టీ నేతల్లో చర్చకు దారితీస్తోంది. తన బావ అమరావతి కోసం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకునే మహేష్ ఇలా మాట్లాడి ఉంటాడని అందరూ చర్చించుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు