స్త్రీలను దేవతలుగా కొలిచే సమాజాల్లో ఆడపిల్లలు పుడితే చాలు కుటుంబాలు ఎందుకంత ఆగ్రహం చెందుతున్నాయో అర్థం కావడం లేదని బాలీవుడ్ సినీ నటి మనీషా కొయిరాలా ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ జాతీయ సమావేశాల్లో అతిథిగా పాల్గొన్న మనీషా తన జన్మ విషయంలో కూడా తమ తాత అలాగే బాధపడ్డారని తెలిపి విచారం వ్యక్తం చేశారు.