అత్తవారి ఇంటిముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది..

శుక్రవారం, 13 ఆగస్టు 2021 (21:01 IST)
అత్తవారి ఇంటిముందే ఓ వివాహిత ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. క్షణికావేశంలో తనకు తాను సజీవ దహనం చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మునిపల్లిలో ఈ ఘటన జరిగింది. హరిప్రసాద్‌రెడ్డికి రెండేళ్ల క్రితం పుదుచ్చేరికి చెందిన సత్యవాణితో ప్రేమ వివాహం జరిగింది. బెంగళూరులో కాపురం ఉంటున్న దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు వచ్చాయి. 
 
నిన్నటి అర్ధరాత్రి భర్త స్వగ్రామం మునిపల్లికి వచ్చిన భార్య సత్యవాణి భర్త ఇంట్లో లేకపోవటంతో అత్త మామలతో తన భర్తను ఇంటికి పిలిపించాలని సత్యవాణి కోరింది. తెల్లవారుజామున ఇంటికి చేరుకున్న భర్త హరి ప్రసాద్, అత్త మామల ముందే భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
క్షణికావేశంలో ఇంటి బయటకు వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని భార్య సత్యవాణి నిప్పంటించుకుంది. ఈ ఘటనతో సత్యవాణి అక్కడికక్కడే సజీవదహనం అయింది. భార్యను కాపాడే ప్రయత్నంలో భర్తకు గాయలయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు