పిల్లలు చనిపోయారు.. తండ్రి షాక్.. గుండెపోటుతో మృతి!

గురువారం, 24 జులై 2014 (13:38 IST)
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తన ఇద్దరు పిల్లలు ప్రమాదంలో మరణించారన్న వార్త విన్న వెంటనే ఓ తండ్రి తల్లడిల్లిపోయాడు. అంతేకాదు.. ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యాడు. అంతేకాకుండా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో, అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. 
 
గురువారం మెదక్ జిల్లాలో స్కూలు బస్సును నాందేడ్ ప్యాసింజర్ ఢీకొన్న ఘటనలో ఇప్పటి వరకు 20 మంది విద్యార్థులు చనిపోయారు. వీరిలో కిష్టాపూర్‌కు చెందిన విద్యార్థులు రజియా, వహీద్ కూడా ఉన్నారు. వీరిద్దరూ గుండెపోటుకు గురైన వ్యక్తి పిల్లలు కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి