చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ ... పెయిడ్ పొలిటికల్ ఆర్టిస్ట్ : పెద్దిరెడ్డి

ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (16:19 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‍పై ఏపీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడుడు పవన్ కళ్యాణ్ అంటూ ఆరోపించారు. అంతేకాకుండా, పవన్ ఓ పెయిడ్ పొలిటికల్ ఆర్టిస్ట్ అని చెప్పారు. 
 
ఆయన ఆదివారం తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ప్రసంగిస్తూ, నిన్నమొన్నటిదాకా బీజేపీని తిట్టిపోసిన పవన్ కల్యాణ్... పాచిపోయిన లడ్డూలనే ఇప్పుడు ఎంతో ఇష్టంగా తింటున్నాడన్నారు. 
 
తిరుపతిలో బీజేపీ-జనసేన-టీడీపీ లాలూచీ పడ్డాయని, ఓ ఒప్పందం ప్రకారం నడుచుకుంటున్నాయని పెద్దిరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని బీజేపీకి తిరుపతిలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.
 
అంతేకాకుండా, టీడీపీ అధినేత చంద్రబాబు రెఫరెండం సవాల్‌ను స్వీకరిస్తున్న‌ట్లు చెప్పారు. ఒక‌వేళ ఈ ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థి ఓడిపోతే త‌మ‌ 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని ఆయ‌న అన్నారు.
 
ఒక‌వేళ ఈ ఉప ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థి ఓడిపోతే టీడీపీకి చెందిన‌ ఎంపీలతో పాటు రఘురామరాజుతో రాజీనామా చేయించాల‌ని స‌వాలు విసిరారు. 
 
కాగా, తిరుప‌తి ఉప ఎన్నిక‌లో సీఎం జ‌గ‌న్ ప్ర‌చార‌ స‌భ ర‌ద్ద‌యిన విష‌యంపై పెద్దిరెడ్డి స్పందిస్తూ.. క‌రోనా వ్యాప్తి కారణంగానే ఆ సభను రద్దు చేసిన‌ట్లు చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు.
 
ఇక, తిరుపతిలో సీఎం జగన్ సభ రద్దుకు కరోనా వ్యాప్తే కారణమని స్పష్టం చేశారు. రోజుకు 3 వేల కేసులు వస్తుంటే బాధ్యతగల సీఎంగా జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. కరోనా ప్రభావంతోనే సభ రద్దు చేసుకున్నారు తప్ప మరో  లేదని అన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు