రిపబ్లిక్ మూవీ వచ్చి నాలుగేళ్లు అవుతోంది. రిపబ్లిక్ విడుదలకు కొన్ని వారాల ముందు, సాయి దుర్గ తేజ్ ప్రమాదానికి గురి అవ్వడం, ప్రమోషన్స్కి అందుబాటులో లేకపోవడం, క్లిష్టకాలంలో విడుదలైన ఈ చిత్రం అందరి ప్రశంసల్ని అందుకుంది. ఏప్రిల్ 2023న విడుదలైన విరూపాక్ష అతని కెరీర్లో భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది.ఆ మూవీ 100 కోట్లకు పైగా వసూలు చేసి ఓ చరిత్రగా సాయి దుర్గ తేజ్ కెరీర్లో నిల్చింది. BRO మూవీతో తన గురువు, ఆరాధ్యుడైన పవర్స్టార్ పవన్ కళ్యాణ్తో స్క్రీన్ స్పేస్ను పంచుకుని సాయి దుర్గ తేజ్ కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నారు.
ఈ సినిమాలు సాయి దుర్గ తేజ్ స్పార్క్ తగ్గలేదని నిరూపించాయి. ప్రతి సినిమా ఒక మైలు రాయిలా మారాయి. రెండున్నర సంవత్సరాల అవిశ్రాంత కృషి తర్వాత సాయి దుర్ఘ తేజ్ సంబరాల ఏటి గట్టుతో తనని తాను మరింత కొత్తగా ఆవిష్కరించుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం సాయి దుర్గ తేజ్ తన శరీరాకృతిని మార్చుకున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రోహిత్ కెపి దర్శకత్వంలో రానున్న ఈ మూవీని 125 కోట్ల బడ్జెట్తో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదలవుతోంది.