వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

సెల్వి

గురువారం, 31 జులై 2025 (16:58 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎక్కడపడితే మహిళలను వేధిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో అఘాయిత్యం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం వుంటున్న ఓ మహిళా వీఆర్వోను ఓ ఎమ్మార్వో కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. 
 
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమెకు అభ్యంతరకరమైన మెసేజ్‌లు పెడుతూ వేధించే వాడని.. 'మీ ఇంటికొస్తా, అడిగింది ఇస్తావా? కోడికూర వండిపెడతావా?' అంటూ అతడు మెసేజ్‌లు పెట్టాడు. దీంతో బాధితురాలిని వేధింపులకు గురిచేశాడు. అంతేగాకుండా.. బుధవారం రాత్రి, ఈ ఎమ్మార్‌ఓ బరితెగించి మహిళా వీఆర్‌ఓ ఇంటికి వెళ్లాడు. 
 
షర్ట్ విప్పి, తన కోరిక తీర్చాలంటూ ఆమెపై బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ ఘటన గురించి తెలుసుకున్న వీఆర్‌ఓ తల్లి సమయస్ఫూర్తితో స్పందించి, ఆ ఎమ్మార్‌ఓను చితకబాదింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇంటికి వస్తా... కోడికూర వండిపెడతావా? అంటూ మహిళా VROకు అసభ్యమైన మెసేజ్‌లు పంపిన MRO

కొంతకాలంగా లైంగిక వేధింపులు కొనసాగిస్తూనే, నిన్న బరితెగించి ఆమె ఇంటికొచ్చి దుస్తులు విప్పి కోరిక తీర్చాలంటూ పీడించాడు!

అక్కడే తన తల్లికి చెప్పిన VRO... వెంటనే ఇంటికి వచ్చి MROను చితకబాదింది. pic.twitter.com/Kw7jwVibNh

— N Media News (@NMediaNewsOffl) July 31, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు