ప్రేమ వివాహం.. భర్తతో విబేధాలు.. అందంగా.. ఒంటరిగా.. వుండటంతో?

సోమవారం, 7 మే 2018 (16:43 IST)
ప్రేమించి వివాహం చేసుకుంది. అందంగా వుండటంతో యాంకరింగ్ చేసేది. భర్తతో కలిసి మ్యూజికల్ నైట్స్ నిర్వహించేది. కానీ ఇంతలో భర్తతో ఆమెకు విబేధాలు తలెత్తాయి. అంతే భర్తకు దూరమైంది. ఒంటరిగా జీవనం గడిపింది. ఇంటి అద్దెకు డబ్బుల్లేక ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసింది. చివరికి ఏమైందో ఏమో కానీ విగతజీవిగా కనిపించింది. ఆమె దారుణంగా హత్యకు గురైంది. 
 
ఈ ఘటన విశాఖ జిల్లా గోపాలపట్నం శివారు ప్రాంతమైన కొత్తపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన ఓ యువజంట నాలుగు నెలల క్రితం గోపాలపట్నం వచ్చి నివాసం ఏర్పరచుకుంది. భర్త హైదరాబాద్, ఒడిశా తదితర ప్రాంతాల్లో నిర్వహించే మ్యూజికల్ నైట్స్‌కు భార్యతో కలసి వెళ్లి ప్రదర్శనలు ఇచ్చి వస్తుండేవాడు. కానీ విబేధాలతో ఆమె సంతోషినగర్‌లో ఒంటరిగా అద్దెకు ఇల్లు మారింది. 
 
అంతేగాకుండా.... తెలుగు రాకపోవడం.. అందంగా వుండటంతో కొందరు ఆమెపై కన్నేశారు. ఓ వ్యక్తి ఆమె ఇంటికి తరచు వచ్చి వెళ్తుండేవాడని.. అతనే తన స్నేహితుల సాయంతో ఆమెను హత్య చేసి, దహనం చేసివుంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు మొదలెట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు