నంద్యాల మండలంలోని కానాల గ్రామానికి చెందిన దూదేకుల మాబూసా కొడుకు దూదేకుల పెద్ద మస్తాన్కు కడప జిల్లా మైదుకూరు మండలం శ్రీనగరం గ్రామానికి చెందిన దస్తగిరమ్మ(40)తో 13 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహమైంది. నిందితుడు మస్తాన్కు దస్తగిరమ్మ స్వయానా అక్క కూతురు. కొన్నేళ్ల పాటు వీరి సంసారం సాఫీగా సాగింది. వీరికి యాసిన్ వలి అనే కొడుకు ఉన్నాడు. వైవాహిక జీవితంలో క్రమేణా ఇద్దరికీ మనస్పర్థలు తలెత్తాయి.
దీంతో భార్యపై అనుమానం పెంచుకోవడంతో పాటు దస్తగిరమ్మకు చెందిన స్థలం డబ్బులు ఇవ్వాలని తరచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మస్తాన్ ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. పొలం పనులకు ఉపయోగించే పికాసి తీసుకొని ఆరుబయట నిద్రపోతున్న భార్య దస్తగిరమ్మను దారుణంగా నరకటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.