విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ అడ్డుకుంటాం... నారా వారి నరకాసుర పాలన... ఎమ్మెల్యే రోజా

గురువారం, 3 నవంబరు 2016 (19:52 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సాగిస్తున్న పాలనను నారా వారి నరకాసుర పాలన అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పాలన పోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం తూట్లు పొడుస్తున్నారనీ, విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ ఫెస్టివల్ ను తాము అడ్డుకుంటామని అన్నారు.
 
రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదాను గాలికి వదిలేశారనీ, ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అందుకే వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో విశాఖలో ఈ నెల 6న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి