రమేష్ ఉప్పు హీరోగా, లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం వీడే మన వారసుడు. రమేష్ ఉప్పు కథ, స్క్రీన్ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్టీటాలెంట్ చూపిస్తున్న రమేష్ ఉప్పును దర్శకరత్న దాసరితో పోల్చారు పాల్గొన్న అతిథులు.