విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణలో మరో అడుగు ముందుకు వేసింది. ఇండియా, జపాన్ సంయుక్త సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా నిర్మించిన పవర్ ప్లాంట్ను ప్రారంభించింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి మోహన్ కుమార్ ఈ ప్లాంట్ను ప్రారంభించారు.
250 కోట్ల రూపాయల పెట్టుబడితో 23 మెగావాట్ల విద్యుత్ను ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయనున్నారు. పర్యావరణ కాలుష్యం లేకుండా ఉక్కు ఉత్పత్తిలో భాగంగా నిరుపయోగమవుతున్నవేడిని తిరిగి ఉపయోగించుకుని ఈ ప్లాంట్ విద్యుత్ ను ఉత్పత్తి చేయనుంది.