విశాఖపట్నం స్మార్ట్ సిటీగా మారబోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో, ఏపీలోని పలు నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్ సిటీల నిర్మాణానికి మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా అత్యధిక ప్రాధాన్యమిస్తోంది.