మీరిచ్చే ముష్టికోసం దేశం విడిచిరాలేదు.. మీరు చంపుతారా లేదా?

శనివారం, 21 డిశెంబరు 2019 (16:38 IST)
మా అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఆ కిరాతకుడిని మీరు చంపుతారా లేకా మాకు అప్పగిస్తారా? అంటా అత్యాచారానికి గురైన బాలిక తల్లి ఆగ్రహంతో ప్రశ్నించింది. పైగా, మీరిచ్చే ముష్టికోసం దేశం విడిచిరాలేదని ఆమె పోలీసులకు ముఖంపై కొట్టినట్టు చెప్పింది. 
 
గత గురువారం గుంటూరులో నేపాలీ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. బాధిత బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, బాధిత బాలిక మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయింది. 
 
'మీరిచ్చే ముష్టి కోసం మేం రాలేదు. దేశం విడిచి వచ్చి రెక్కల కష్టం మీద బతుకుతున్నాం. ఇన్నేళ్లలో ఎప్పుడూ మాపై దాడులు జరగలేదు. ఇప్పుడు ఘోరం జరిగింది. మా అమ్మాయిపై అత్యాచార యత్నం చేసిన వాడిని మీరు చంపుతారా? మా చేతికిస్తారా?' అంటూ పోలీసులను నిలదీసింది. 
 
ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను పరామర్శించేందుకు రాష్ట్ర చైల్డ్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ కమిషన్‌ మెంబర్‌ పి.పద్మలత వచ్చారు. ఈసందర్భంగా బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. 'మాకు ఎలాంటి పరిహారం వద్దు.. వీలైతే వాణ్ని చంపండి.. లేదా మేం చంపుతాం. మాకు అప్పగించండి!' అని డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు