న్యాయ పోరాటంతో వైసీపీ అన్యాయాలను ఎదుర్కొంటాం...

గురువారం, 25 నవంబరు 2021 (18:54 IST)
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో వైసీపీ కక్షసాధింపు రాజకీయాలకు బాధితుడైన మైనార్టీ నాయకుడు పఠాన్ ఖయ్యూమ్ ఖాన్ కు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  ధైర్యం చెప్పారు. నెల్లూరు పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడికి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటాచలం సెంటర్ లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇటీవల వైసీపీ నేతల కక్ష సాధింపులో భాగంగా అధికారులు కూల్చివేసిన ఖయ్యూమ్ ఖాన్ కు చెందిన దుకాణాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. 

 
అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాలకు నిరసనగా చేపట్టిన దిష్టిబొమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారని కక్షకట్టి ఖయ్యూమ్ ఖాన్ దుకాణాన్ని రాత్రికి రాత్రి అధికారులతో కూల్చివేయించారని సోమిరెడ్డి చంద్ర‌బాబుకు వివరించారు. 
 

ఖయ్యూమ్ ఖాను కు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు న్యాయపోరాటానికి అండగా నిలుస్తామని చంద్రబాబు నాయుడు  భరోసా ఇచ్చారు. ప్రజలతో పాటు ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని  టీడీపీ అధినేత దైర్యం చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు