కర్ణాటక రాష్ట్రం ముళబాగల్లోని పద్మరాజమఠ పీఠాధిపతి కేశవనిధి తీర్థ స్వామి శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు, ప్రధాన అర్చకులు ఆయనకు ఆలయం ఎదుట సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి ఆలయప్రవేశం చేయించారు.