శ్రీవారిని దర్శించుకున్న పద్మరాజ పీఠాధిపతి.

శనివారం, 20 డిశెంబరు 2014 (21:32 IST)
కర్ణాటక రాష్ట్రం ముళబాగల్లోని పద్మరాజమఠ పీఠాధిపతి కేశవనిధి తీర్థ స్వామి శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు, ప్రధాన అర్చకులు ఆయనకు ఆలయం ఎదుట సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి ఆలయప్రవేశం చేయించారు. 
 
అనంతరం ఆయన స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితరులు పాల్గొన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి