వైసీపీ పార్టీ పట్టిసీమకు వ్యతిరేకమా? లేదా అనుకులమా? అని ఏపీ సీఎం చంద్రబాబు అనేకసార్లు ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి తాము వ్యతిరేకం కాదని, కానీ నదుల అనుసంధాన విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
అంతకుముందు పట్టిసీమ ప్రాజెక్టుపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టింది రూ.200 కోట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. కేవలం ధనార్జన కోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని నెహ్రూ ఆరోపించారు.