పోలవరం జలాశయాన్ని నింపకూడదు : ప్రకాష్ జావదేకర్

బుధవారం, 11 మే 2016 (09:11 IST)
పోలవరం ప్రాజెక్టును నీటితో నింపేందుకు కేంద్రం సమ్మతించలేదు. పొరుగు రాష్ట్రాలైన ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌లతో తలెత్తిన వివాదాలు ముగిసే వరకూ పోలవరం జలాశయాన్ని నింపొద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ తెలిపారు. 
 
లోక్‌సభలో టీడీపీ సభ్యుడు కింజరపు రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ పోలవరం నిర్మాణంపై విధించిన నిలుపుదల ఉత్తర్వులను శాశ్వతంగా ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం తమను కోరిందని తెలిపారు. అయితే, గతేడాది జూన్‌లో కొన్ని నిబంధనలతో ఏడాది పాటు నిర్మాణాన్ని కొనసాగించుకునేందుకు అనుమతించామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి