రాజ‌మండ్రి ఎంపీ భరత్ రామ్ కు భారత్ యూత్ అవార్డు

శుక్రవారం, 13 ఆగస్టు 2021 (09:11 IST)
రాజమహేంద్రవరం ఎంపీ, వై ఎస్ ఆర్ సి పి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ "భారత్ యూత్ అవార్డు"ను అందుకున్నారు. భారత్ గౌరవ అవార్డు పౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో భారత్ యూత్ అవార్డు ప్రధానోత్సవం న్యూఢిల్లీలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర అర్బన్ ఎఫైర్స్ శాఖ మంత్రివర్యులు కౌశల్ కిషోర్ చేతుల మీదుగా ఎంపీ భరత్ రామ్ కు భారత్ యూత్ అవార్డు ప్రధానం చేశారు. ఎంపీ భరత్ రామ్ కు అవార్డు ను పురస్కరించుకొని ఎంపీలు, ఎమ్మెల్సీలు, అభిమానులు, నాయకులు అభినందనలు తెలియజేశారు.

యువ ఎంపీగా భ‌ర‌త్ రామ్ మ‌రిన్ని శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని, ఆయ‌న యువ రాజ‌కీయ వేత్త‌గా ఎద‌గాల‌ని రాజ‌మండ్రి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని పలువురు ఎంపీకి అభినంద‌న‌లు తెలిపారు.

భార‌త దేశానికి ఇపుడు యువ నాయ‌క‌త్వం చాలా అవ‌స‌రం అని, ఇలాంటి పుర‌స్కారాలు యువ‌త మ‌దిలో రాజ‌కీయ చైత‌న్యాన్ని, స‌మాజ సేవ‌త‌త్ప‌ర‌త‌ను నింపుతాయ‌ని పేర్కొంటున్నారు. అవార్డు అందుకున్న ఎంపీ భ‌ర‌త్ రామ్ మాట్లాడుతూ, త‌న బాధ్య‌త‌ను ఈ అవార్డు మ‌రింత పెంచింద‌న్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు