చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గంగాపురానికి చెందిన ఎం.అరుణ (27) బీఏ, బీఈడీ చేసింది. అయితే.. గ్రామంలోని వేరే కుటుంబంతో వీరి కుటుంబానికి ఆస్తి వివాదం ఉండటంతో.. తమకు న్యాయం చేయాలని కోరుతూ మూడేళ్ల కిందట.. తన తల్లితో కలసి పలమనేరు డీఎస్పీకి వారు ఫిర్యాదు చేశారు.
ఆసమయంలో రామకుప్పం ఎస్సైగా పనిచేస్తున్న సునీల్ కుమార్ సమస్యను తాను పరిష్కరిస్తానంటూ తన నంబర్ అరుణకు ఇచ్చి.. ఆమె నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు పలు మార్లు ఫోన్ చేస్తూ.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన అరుణ.. అతనికి లొంగిపోయింది. ఆ తర్వాత వీరిద్దరూ శారీరకంగా కలుస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె రెండు సార్లు గర్భందాల్చింది. గర్భం పోవడానికి మాత్రలు తెచ్చి మింగించాడు.
ఈ సారి కూడా గర్భస్రావం చేయించడానికి యత్నించాడు సునీల్. అయితే అరుణ పెళ్లి చేకుందామని పట్టుబట్టింది. దీంతో ఆమెను కొట్టి, బెదిరించి మాత్రలు మింగించాడు. అంతేకాదు.. ఇల్లు కడుతున్నామని చెప్పి అరుణ నుంచి రూ.20 లక్షలు కూడా తీసుకున్నాడు. ఈ డబ్బు ఇచ్చినట్టు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని అరుణ చెబుతుంది. ఆ తర్వాత సునీల్, అతని తల్లిదండ్రులు, బావ, మరి కొందరు అరుణ ఇంటికి వచ్చి ఆమె తండ్రిని బెదిరించారు. సునీల్కు వేరే అమ్మాయితో రూ.70 లక్షలకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పలమనేరు డీఎస్పీ శంకర్ దర్యాప్తు చేస్తున్నారు.