వరంగల్ జిల్లాలోని ములుగులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. 20 ఇళ్ళని ఏకకాలంలో దోచేసుకున్నారు. వరంగల్ జిల్లాలో దోపిడీ దొంగలు శుక్రవారం వేకువజామున బీభత్సం సృష్టించారు. ఇక్కడి 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 తులాల బంగారాన్ని, రూ. లక్ష నగదును అపహరించారు.