చుక్కనీటినీ వదులుకోం.. రెచ్చగొడితే రెచ్చిపోం : సజ్జల

సోమవారం, 5 జులై 2021 (06:38 IST)
శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలోకి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్న తెలంగాణా ప్రభుత్వం తీరుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలలో ఒక్క చుక్క నీటిని వదులుకోబోమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అది చేస్తామని అన్నారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశామని, ఈ విషయంపై ఎక్కడ మాట్లాడాలో అక్కడ తప్పకుండా మాట్లాడతామని అన్నారు. వారు రెచ్చగొడితే రెచ్చిపోమని తెలిపారు.

ఆదివారంనాడు కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులనుండి 16వేల క్యూసెక్కులు, పులిచింతలలో ఏడువేల క్యూసెక్కులకు పైగా విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం దిగువకు వదిలారు. హైదరాబాద్‌లో తన ఆస్తులు వున్నందుకే సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నోరుమెదపడం లేదని తెలుగుదేశం విమర్శించింది.

ట్రిబ్యునల్‌ తీర్పుల ప్రకారం రాష్ట్ర నీటివాటాను రాబట్టేందుకు కెసిఆర్‌ సవాల్‌కు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలని తెలుగుదేశం నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు