తెలంగాణ సీఎం కేసీఆర్ తాగుబోతు కాబట్టే తాగుబోతులను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ మహిళా నేత శోభారాణి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో చీప్ లిక్కర్ను తీసుకురాబోతున్న కేసీఆర్పై శోభారాణి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇక మంత్రులు చీప్ లిక్కర్ బాటిళ్లు పట్టుకుని బ్రాండ్ అంబాసిడర్లలా వ్యవహరించడం బాధాకరమని శోభారాణి వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో చీప్ లిక్కర్ను ఉపసంహరించుకోకపోతే తాము చీపుర్లు పట్టుకోవాల్సి వస్తుందని విమర్శించారు. చీప్ లిక్కర్కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని, వచ్చే నెల 1, 2 తేదీల్లో చీప్ లిక్కర్పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని శోభారాణి చెప్పారు.