అనూషను అందుకే హత్య చేశాడు: ఎస్పీ విశాల్

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (16:50 IST)
నరసరావుపేటలో సంచలనం సృష్టించిన అనూష హత్య కేసు వివరాలను రూరల్ ఎస్పీ విశాల్ వివరించారు. అనూషపై అనుమానంతోనే సహవిద్యార్థి విష్ణువర్థన్ హత్య చేసాడని తెలిపారు.
 
అనూష వేరే యువకుడితో చనువుగా వుంటోందనీ, తనను కాదని వేరే యువకుడితో తిరుగుతోందన్న అనుమానంతో ఆమెను ఈ నెల 24న నరసరావుపేట శివారుకు తీసుకెళ్లి అక్కడ గొడవపెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమెపై ఆగ్రహంతో గొంతు నులిమి హత్య చేసాడు. ఆ తర్వాత ఆమె ఆనవాళ్లను లేకుండా చేయాలని ప్రయత్నించాడు.
 
ఐతే స్థానికుల సమాచారంతో దొరికిపోయాడు. ఈ హత్య కేసుకు సంబంధించి నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేట్లు కోర్టును కోరుతామని ఆయన వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు