బాపు లేని తెలుగింటికి పరిపూర్ణత లేదు : గవర్నర్ రోశయ్య

సోమవారం, 1 సెప్టెంబరు 2014 (11:15 IST)
టాలీవుడ్ దర్శకుడు బాపు లేని తెలుగింటికి పరిపూర్ణత లేదని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. బాపు మృతిపై ఆయన స్పందిస్తూ... ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. 
 
తెలుగు చిత్ర, చలన చిత్ర రంగాలకు బాపు మృతి కోలుకోలేని దెబ్బ అని అన్నారు. బాపు లేని తెలుగింటికి పరిపూర్ణత రాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు లోగిలిలో ఆడపిల్ల పుడితే బాపు బొమ్మ పుట్టిందని మురిసిపోతారని ఆయన తెలిపారు. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ స్పందిస్తూ.. తెలుగు చిత్రసీమ గర్వించదగిన మహోన్నత దర్శకుడు బాపు అని కొనియాడారు. బాపు మరణించిన రోజు తెలుగుజాతికి నిజంగా దుర్దినంగా పేర్కొన్నారు. ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని విచారం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి