ఆత్రంపడే కాంబాబు, అర గంట పనోడు అవంతిల‌ను ఆదర్శంగా తీసుకున్నాడేమో?

బుధవారం, 22 సెప్టెంబరు 2021 (16:07 IST)
వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు  కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే, తామేమి తక్కువ తినలేదంటూ వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నార‌ని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా విమ‌ర్శించారు. కాటికి కాలుచాపే వయస్సులో అన్నీ చేయించుకోవాలనే ఆత్రపడే కాంబాబు, అర గంట పనోడు అవంతిల‌ని ఆదర్శంగా తీసున్నాడేమో?  విశాఖ వైసీపీ నాయకుడు వెంకటరావు  దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడ‌ని ఎద్దేవా చేశారు.

సభ్య సమాజం తలదించుకునేలా దివ్యాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణమ‌ని లోకేష్ పేర్కొన్నారు. దివ్యాంగురాలికి సాయం అందించాల్సిన చేతులే చిదిమేయడం ఘోరమ‌ని, వైకాపా రేపిస్టుల తరపున పోలీసులు వకాల్తా పుచ్చుకుని, చచ్చు మాటలు పుచ్చు వాదనలతో ప్రెస్ మీట్ పెట్టొద్ద‌ని విజ్న‌ప్తి చేశారు. చేతనైతే, మీరు నిజమైన పోలీసులైతే నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాల‌ని నారా లోకేష్ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు