దివ్యాంగుల‌ కుటుంబానికి నారా లోకేష్ స‌హాయం

శనివారం, 11 సెప్టెంబరు 2021 (19:30 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త‌న హామీ మేరకు దివ్యాంగులు పాపిరెడ్డి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మధ్య ప్రసార మాధ్యమంలో ప్రసారమైన పాపం పసివాడు... 8 సంవత్సరాల పిల్లవాడు ఆటో నడుపుతూ తన తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉన్నాడనే వీడియో అయిటెమ్ ని చూశారు. ఈ వయసులో పుట్టుగుడ్డి అయినా తన తల్లితండ్రులకు పెద్ద దిక్కుగా నిలిచాడని వచ్చిన వార్తకి స్పందించి, తక్షణమే 50,000 ఆర్థిక సహాయం ప్ర‌క‌టించారు. సబ్సిడీ పైన తీసుకున్న ఆటో రెండు లక్షల రూపాయలు మొత్తం చెల్లిస్తానని, విద్యార్థికి చదువు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని పత్రికాముఖంగా మాట ఇచ్చారు. 
 
ఇచ్చిన మాట ప్రకారం అంధ కుటుంబం (పాపిరెడ్డి గంగుడు పల్లి పంచాయతీ) చంద్రగిరి మండల పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం 50 వేలుకు బదులు 80 వేల‌ రూపాయలు అందించారు. ఆటోకి,  చదువుకి సంబంధించిన జిల్లా పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని ద్వారా వారికి త్వరలో న్యాయం చేస్తామని తెలుగుదేశం నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు గౌస్ బాష, గంగంపల్లి భాస్కర్, దొమ్మలపాటి సతీష్, రేజర్ల యశ్వంత్ చౌదరి, భాను ప్రకాష్ రెడ్డి, కాపు  వీధి తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు