బైక్‌పై వెళుతున్న జంటను ఆపి.. మహిళను రేప్ చేసిన కానిస్టేబుల్

శనివారం, 16 జూన్ 2018 (16:01 IST)
మహిళలపై సాధారణ పౌరులే కాదు.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటులు సైతం అత్యాచారాలకు తెగబడుతున్నారు. అదీ వాహనాల తనిఖీల పేరుతో ద్విచక్రవాహనాలు ఆపిమరీ ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా వేములపల్లిలో ఓ మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సూర్యాపేట జిల్లా చివ్వెంల పీఎస్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా బాలూనాయక్  పని చేస్తున్నాడు. ఈయన వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యాడు. అపుడు బైకులపై వచ్చే జంటలను ఆపి వారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం బైకుపై వెళుతున్న ఓ జంటను ఆపాడు. 
 
వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసుకున్న అనంతరం, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేయగా, బాలూ నాయక్‌ను నల్గొండ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు