ఆ మహిళతో లింకు పెట్టుకుని నన్ను పట్టించుకోవడం లేదు : సీఐపై భార్య కేసు

మంగళవారం, 23 అక్టోబరు 2018 (08:59 IST)
ఓ కేసు విచారణ నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత మొదటి భార్యకు తెలియకుండా ఆ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కట్టుకున్న భార్యతో పాటు.. పిల్లలను నిర్లక్ష్యం చేయసాగాడు. దీనిపై భార్య సీఐపై కేసు పెట్టింది. హైదరాబాద్‌ నగరంలోని కొత్తపేటలో వెలుగుచూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కొలకపల్లి రాజయ్య తాండూరు కొరణ్‌కోటలో ఎస్ఐగా ఉన్న సమయంలో ఓ కేసు విషయంలో ఓ మహిళ ఠాణాకు వచ్చింది. ఆ మహిళతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఎవరికీ తెలియకుండా 2009 మే 10వ తేదీన యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి తొలి భార్య రేణుకను, ముగ్గురు పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. 
 
ఈ విషయం తెలిసిన రేణుక ఆగ్రహంతో భర్తను నిలదీసింది. అయితే, ఖాకీ పవర్ ముందు ఆమె బలం చాల్లేదు. దీంతో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కు సోమవారం ఫిర్యాదు చేసింది. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్త... తనను, తన ముగ్గురు పిల్లల్ని వదిలేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ, అంతకుముందే శ్రీవాణి అనే మహిళను రాజయ్య పెళ్లి చేసుకుని ఆమెకు దూరంగా ఉన్నాడని పేర్కొంది. ప్రస్తుతం రీటా అనే యువతితో మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని వాపోయింది. ఈ విషయమై నిలదీస్తే.. పోలీసు శాఖలో ఉన్న తనను ఏమీ చేయలేరనీ, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తున్నట్లు తెలిపింది. రేణుక ఫిర్యాదుతో రాజయ్యపై సరూర్‌నగర్‌ మహిళా పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు