హుండీలు నిండిపోయాయి, కానుకలు వేయొద్దన్న వేములవాడ ఆలయ సిబ్బంది

మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (18:01 IST)
హుండీలు నిండాయని భక్తుల నుంచి కానుకలు తీసుకోని ఘటన వేములవాడ రాజన్న ఆలయంలో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం గర్భగుడి ఆవరణలోని హండీలు నిండాయని ఆలయాధికారులు భక్తుల నుంచి కానుకలు స్వీకరించలేదు. దాంతో భక్తులు తమ కానుకలను ఆలయంలో ఎక్కడబడితే అక్కడ సమర్పించారు.
 
ఆ కానుకలన్నింటిని ఆలయ సిబ్బంది తమ జేబుల్లో నింపుకున్నారు. ఆలయ సిబ్బంది నిర్వాకంతో వేలాది రూపాయల కానుకలు దుర్వినియోగమైనట్లు ఆరోపణపలు వస్తున్నాయి.
 కాగా.. ఈ ఘటనపై ఈఓ కృష్ణ ప్రసాద్ స్పందించారు.
 
బ్యాంక్ సిబ్బంది చిల్లర నాణాలు తీసుకోకపోవడంతోనే హుండీ లెక్కింపు ఆలస్యమైందని.. అందువల్లే హుండీలు నిండిపోయాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. వెంటనే నిండిన హుండీలను ఖాళీ చేయించి.. వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు