అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

ఠాగూర్

ఆదివారం, 18 మే 2025 (09:56 IST)
కర్నాటక రాష్ట్రంలోని కోలార్‌కు చెందిన శివన్న, లోకేశ్, గంగరాజులు ఏపీలో వ్యక్తిగత పనులు నిమిత్తం కారులో కారులో వచ్చారు. వీరు తమ పనులు ముగించుకుని స్వగ్రానికి తిరిగి వెళుతుండగా, వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం కారణంగా కారులో ప్రయాణిస్తున్న శివన్న, లోకేశ్, గంగరాజు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. 
 
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు బావి నుంచి కారు మృతదేహాలాను వెలిక తీయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు