నల్లమలలో బహిర్భూమికి వెళ్లిన గిరిజన మహిళపై అత్యాచారం

ఆదివారం, 9 అక్టోబరు 2016 (09:05 IST)
కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఓ గిరిజన మహిళపై అత్యాచారం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఈ మహిళపై పూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
దసరా పండుగ సందర్భంగా తన కూతురును ఇంటికి తీసుకెళ్లేందుకు ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు చెంచుగూడేనికి చెందిన దాసరి వీరన్న బైర్లూటి చెంచుగూడేనికి వచ్చాడు. ఈయన శుక్రవారం రాత్రి అక్కడే బసచేశాడు. రాత్రి సమయంలో గూడేనికి చెందిన మహిళ బహిర్భూమికి అటవీ ప్రాంతంలోకి వెళ్లడాన్ని గమనించాడు.
 
ఆ తర్వాత తాను ఆమెను అనుసరించాడు. వీరన్న అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉండటంతో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితిలో పడివున్న ఆ మహిళను గుర్తించి గూడేనికి తీసుకెళ్లారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

వెబ్దునియా పై చదవండి