కీసర వద్ద న్యాయవాది ఉదయ్కుమార్ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం సజీవదహనం చేశారు. న్యాయవాది ఉదయ్ కుమార్ సజీవ దహనం కేసును పోలీసులు అన్నికోణాల్లో విచారించి అసలు నిందితుడిని పట్టుకున్నారు. న్యాయవాదిని హత్య చేసింది.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన లోకేష్గా తేలింది. భూతగాదాల కారణంగా ఈ హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు.
గతంలో కీసరలోని 5 ఎకరాల భూమిని ఉదయ్ కుమార్ గతంలో లోకేష్కు విక్రయించారు. ఆ తర్వాత ఆ భూమి తమకు కావాలని, డబ్బు తిరిగి చెల్లిస్తామని లోకేస్కు చెప్పాడు. అయితే లోకేష్ ససేమిరా కుదరదని తేల్చిచెప్పేశాడు. ఈ విషయంగా ఉదయ్ కుమార్ అతనిపై తీవ్రంగా ఒత్తిడి చేశాడు. దీంతో కోపాద్రిక్తుడైన లోకేష్... ఉదయ్ కుమార్ను కర్రతో కొట్టి ఆ తర్వాత కారులో బంధించి సజీవ దహనం చేశాడు. పోలీసులు విచారణలో లోకేష్ చేసిన నేరాన్ని అంగీకరించాడు. లోకేష్కు సహకరించిన అతడి స్నేహితుడిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు.