మ‌హ‌ర్షి గురించి ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు రివ్యూ..!

గురువారం, 16 మే 2019 (19:29 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో.. రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే... ఈ సినిమాపై భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప్రశంసల వ‌ర్షం కురిపించారు. కుటుంబ సభ్యులతో కలిసి మహర్షి చిత్రాన్ని వీక్షించిన ఆయన ట్విట్ట‌ర్ వేదిక‌గా చిత్ర యూనిట్‌‌కి అభినందనలు తెలియజేశారు. 
 
ఇంత‌కీ ఆయ‌న ఏమ‌ని స్పందించారంటే... కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మహర్షి చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం మహర్షి. 
 
సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు