మరిదితో అక్రమసంబంధం.. పట్టించుకోలేదని వదిన ఆ పని చేసింది?

బుధవారం, 19 జూన్ 2019 (17:32 IST)
అక్రమ సంబంధాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా అక్రమ సంబంధం కారణంగా తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంత మరిదిపై వదిన నిప్పంటించిన ఘటన విజయవాడలోని సనత్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే., విజయవాడ సనత్ నగర్‌లో ఖలీల్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి వుంటున్నాడు. ఈ క్రమంలో వదిన ముంతాజ్‌తో ఖలీల్‌కు అక్రమ సంబంధం ఏర్పడింది. 
 
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరిది, పెళ్లి అయ్యాక తనను దూరం పెట్టడంతో తట్టుకోలేకపోయిన ఓ మహిళ భార్యాభర్తలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దుర్ఘటనలో భార్య చనిపోగా, భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఈరోజు ఈ దారుణం చోటుచేసుకుంది.
 
విజయవాడలోని సనత్ నగర్‌లో ఖలీల్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో వదిన ముంతాజ్ తో ఖలీల్ కు అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే అన్నను చూసేందుకు సోదరి హుజున్ని ఖలీల్ ఇంటికి వచ్చింది. 
 
వదిన, అన్నలతో ఇంట్లో కూర్చుని మాట్లాడుతోంది. ఐతే ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చిన ముంతాజ్ తన తోటికోడలు అనుకుని హుజున్నీపై, అలాగే ఖలీల్‌పై పెట్రోల్ చల్లింది. వారు తేరుకునేలోగానే నిప్పంటించింది. దీంతో మంటల్లో కాలిపోయి హుజున్నీ అక్కడికక్కడే చనిపోగా, ఖలీల్ కు 80 శాతం కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు