కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు, భర్తను భార్యే చంపినట్టు తేలింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 18వ తేదీన భర్త వేధింపులు భరించలేక సాములును కరెంట్ షాకుతో చంపేసినట్టు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి ప్రాంగణంలోనే పూడ్చిపెట్టింది. అయితే, ఈ హత్యకు ఆమె తన చెల్లి భర్త సహకారం తీసుకున్నట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.