Pahalgam terror attack ఫిబ్రవరిలో కాన్పూర్ వ్యాపారవేత్త పెళ్లి: కాశ్మీర్‌ పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో మృతి

ఐవీఆర్

మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (22:50 IST)
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam terror attack) లో కాన్పూర్‌కు చెందిన సిమెంట్ వ్యాపారి శుభం ద్వివేది (31) కాల్చి చంపబడ్డాడు. అతడికి ఇటీవల ఫిబ్రవరిలో వివాహం అయింది. అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ సందర్శించడానికి వెళ్ళారు. ఈ ప్రయాణం వారి వైవాహిక జీవితంలో పెను విషాదాన్ని మిగిల్చింది.
 
సంఘటన జరిగిన సమయంలో శుభం భార్య కూడా సంఘటనా స్థలంలోనే ఉంది. ఉగ్రవాదులు మొదట శుభమ్ పేరు అడిగారు, ఆ తర్వాత అతని తలపై కాల్చి చంపారని ఆమె ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు చెప్పారు. బుల్లెట్ గాయం కారణంగా శుభం అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాద సంఘటన తర్వాత కుటుంబం, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.
 
ఈ వార్త శుభం గ్రామం కాన్పూర్‌లోని హాతిపూర్‌కు చేరుకోగానే, ఆ ప్రాంతమంతా శోకసంద్రం అలుముకుంది. గ్రామ ప్రజలు అతని ఇంటి వద్ద గుమిగూడి కుటుంబ సభ్యులను ఓదార్చడం ప్రారంభించారు. శుభం తండ్రి సంజయ్ ద్వివేది ఈ విచారకరమైన వార్తను తనకు చెప్పారని శుభం మామ మనోజ్ ద్వివేది తెలిపారు.
 
శుభం ద్వివేది తన వినయపూర్వకమైన స్వభావం, కృషి కారణంగా ఆ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందాడు. ఆయన అకాల మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతదేహాన్ని కాన్పూర్‌కు తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభించించారు. పోలీసులు, భద్రతా సంస్థలు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాయి. ఈ సంఘటన కాశ్మీర్‌లో పర్యాటకుల భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు