లోక్సభ నియోజకవర్గంలో ఉన్న సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలను బేరీజు వేసుకుని ఓ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు తిరుపతి ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిని కూడా దాదాపు ఖాయం చేసినట్టు పార్టీలోని అంతర్గత సమాచారం. గుంటూరు జిల్లా నుంచి గతంలో టీడీపీ నుంచి ఓసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత జనసేన పార్టీలో చేరిన ఆ నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.
తిరుపతి సీటు తమకు ఇవ్వాలని కోరుతున్నందునే పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీలో బీజేపీకి జై కొట్టినట్టు చెబుతున్నారు. అయితే, గతంలో ఓ సారి అక్కడ గెలిచిన తాము మరే పార్టీకి ఇవ్వబోమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో బీజేపీ పవన్ కళ్యాణ్కు షాక్ ఇవ్వనున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి ఏమౌతుందో వేచి చూడాలి.