సభ్య సమాజాం సిగ్గుపడే రీతిలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులంతా ఏకమై ఓ మహిళను వివస్త్రను చేసి, చితకబాదారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలోని వడ్డిపల్లి గ్రామంలో కలకలం రేపింది.
సమాచారం అందుకున్న హిందూపురం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, గ్రామస్థులు కొందరు మాత్రం ఆ మహిళ మంత్రాలు చేస్తోందని, పలువురితో వ్యభిచారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.