వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిళ తెలంగాణలో చేపట్టే పరామర్శ యాత్ర డిసెంబర్ 8న పాలమూరులో ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు ఏకబిగిన జరగనున్న ఈ యాత్రలో ఆమె, మొత్తం ఐదు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం గుండెపోటుతో మరణించిన 16 మందికి చెందిన కుటుంబాలను ఈ పర్యటనలో ఆమె పరామర్శిస్తారు.