వాడవాడలా వై.ఎస్.ఆర్ కి ఘన నివాళి... కాంగ్రెస్ వాళ్ళు కూడా...

గురువారం, 2 సెప్టెంబరు 2021 (15:32 IST)
ప్రజల గుండెల్లో ఇప్పటికి ఎప్పటికి గుర్తుండే నాయకుడు వైఎస్ఆర్. అందుకే ఆయ‌న‌కు వాడ‌వాడ‌లా ఘ‌న నివాళులు ప‌లికారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ వారు కూడా ఉన్నారు. విజ‌య‌వాడలోని ఆంధ్ర‌ర‌త్న భ‌వ‌న్లో మాజీ సీఎం వై.ఎస్. ఆర్. చిత్ర‌ప‌టానికి జిల్లా కాంగ్రెస్ నాయ‌కులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. న‌ర‌సింహారావు, రాజీవ్ ర‌త‌న్ లు వై.ఎస్. గొప్ప‌త‌నాన్ని శ్లాఘించారు. 
 
మ‌రో ప‌క్క, బడుగు, బలహీన వర్గాల వారు ఆయన అందించిన సంక్షేమ పథకాలను స్మరించుకుంటున్నారని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు , వయోవృద్ధుల, దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం ఉదయం కొవ్వూరు మెయిన్ రోడ్డు లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంత్రి,  కొవ్వూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 
 
అంతకుముందు మంత్రి తానేటి వనిత  క్యాంపు కార్యాలయంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి భోజన పేకట్లను పంపిణీ చేశారు. మంత్రి పర్యటనలో భాగంగా కొవ్వూరు వాటర్ ట్యాంక్ నందు గల,  విజయవిహార్ సెంటర్ లో గల వైస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రి నివాళులు  అర్పించారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ ,  వాత్స్యల్య వృద్ధాశ్రమం నందు వృద్ధులకు పళ్ళు పంపిణీ , వస్త్ర దానం కార్యక్రమాలలో పాల్గొన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు