ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైకాపా నేతలు మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలన ఉగ్రవాదం, తీవ్రవాదం కంటే ప్రమాదకరంగా ఉందని కన్నా ప్రమాదకరంగా మారిందని ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు.
ఇదే హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై పోరాడితే ఉగ్రవాదులా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని సీఎం చంద్రబాబు ఉగ్రవాదం, తీవ్రవాదంతో పోలుస్తున్నారని మేరుగ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు... ప్రభుత్వ అవినీతికే వ్యతిరేకమని స్పష్టం చేశారు.