తేనె దేవామృతం.. ఉప్పులో రాక్షస గుణం..

మంగళవారం, 21 ఆగస్టు 2018 (14:17 IST)
ఉప్పుతో ఆరోగ్యానికే ముప్పేనని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు మోతాదు మించితే ఆరోగ్యానికే చేటేనని వారు చెప్తున్నారు. ఆహారంలో రుచికోసం ఉప్పును ఉపయోగిస్తే సరి.. అదే మోతాదు మించితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. ఆయుర్వేదం ప్రకారం ఉప్పు లేని ఆహారం తీసుకోలేని వారు మితంగా ఉప్పును వాడటం చేయాలి. కానీ రోజూ తేనెలో నానబెట్టిన ఉసిరికాయను తీసుకుంటూ వుండాలి. అలాతీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
ఇంకా ఆరోగ్యంగా వుండాలంటే.. మాసానికి రెండుసార్లైనా మూడు పూటలా ఉప్పులేని ఆహారాన్ని తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తోంది. అలాగే ఆహారంలో తేనేను అప్పుడప్పుడు చేర్చుకోవాలి. ఇది మధుమేహాన్ని దూరం చేస్తుంది. తేనెను పాలతో కలిపి తీసుకోవడం ద్వారా శరీరంలో ఉప్పు నిల్వను దూరం చేస్తుంది. ఉప్పు శాతం అధికంగా వుండే ఆహారం.. అంటే మాంసాహారాన్ని అధికంగా తీసుకోకూడదు. 
 
తేనేను ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యకరంగా వుండొచ్చునని.. ఉప్పును చేర్చితే అనారోగ్య సమస్యలు తప్పవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అందుకే తేనెను దేవామృతం అని.. ఉప్పును రాక్షస గుణంతో పోల్చుతారు. అందుకే తేనె వాడకాన్ని పెంచి.. ఉప్పు వాడకాన్ని తగ్గించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు