సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

ఠాగూర్

సోమవారం, 16 జూన్ 2025 (17:19 IST)
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (78) అనారోగ్యంబారినపడ్డారు. దీంతో ఆమెకు వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుండగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
ఆదివారం రాత్రి సోనియా గాంధీకి నలతగా ఉండటంతో ఆమె వ్యక్తిగత సిబ్బంది వెంటనే స్పందించి హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి గత కొంతకాలంగా ఆమె ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆమెను ఆస్పత్రిలో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో చేర్పించినట్టు గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ వెల్లడించారు.
 
సోనియా గాంధీ ఉదర సంబంధిత సమస్య కారణంగా ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది అని డాక్టర్ అజయ్ స్వరూప్ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఆమెకు అవసరమైన చికిత్స అందిస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు