సత్యంలో వాటా తగ్గించుకున్న ఫిడెలిటీ

వేలాద కోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ సంస్థలో విదేశీ ఫండ్ సంస్థ ఫెడిలిటీ తన వాటాను తగ్గించుకుంది. సత్యం సంస్థ ఇప్పటికే టెక్ మహీంద్రా కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. సత్యం కంప్యూటర్స్‌లో 1.18 కోట్ల షేర్లను (1.76 శాతం వాటా) విక్రయించడం ద్వారా ఫిడెలిటీ వాటా 5.77 శాతం నుంచి 4.02 శాతానికి తగ్గిపోయింది.

విక్రయించిన వాటా విలువ 55.08 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ముంబై స్టాక్ మార్కెట్‌కు కంపెనీ తెలియజేసింది. ఇటీవలే టెక్‌ మహీంద్రా తన అనుబంధ సంస్థ వెంచర్‌బే కన్సల్టెంట్స్‌ ద్వారా సత్యం కంప్యూటర్స్‌లో 31 శాతం వాటాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి