రద్దు అయిన పాత కరెన్సీ నోట్ల మార్పిడికి ఇండియన్స్ బ్యాంక్స్ అసోసియేషన్ సరికొత్త షరతు విధించింది. ఆయా బ్యాంకుల్లో ఖాతాలో ఉన్న వారికి మాత్రమే కొత్త నోట్లు ఇస్తామని తేల్చి చెప్పాయి. గత పది రోజులుగా తమ బ్యాంకు ఖాతాదారులకు ఎలాంటి సేవలు అందించలేక పోతున్నామనీ, ఇక అందువల్ల తమ బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే ఈ సేవలు అందిస్తామని తెలిపింది.
అందువల్ల శనివారం ఆ పెండింగ్ పని పూర్తిచేసుకోవడంతోపాటు సొంత ఖాతాదారుల కోసం మాత్రమే పనిచేస్తామని, ఇతర బ్యాంకులకు చెందినవారి నోట్లను మార్పిడి చేయకూడదని నిర్ణయించామని వెల్లడించారు. కానీ, సీనియర్ సిటిజన్లకు మాత్రం మినహాయింపు ఉంటుందని.. వారు ఏ బ్యాంక్ బ్రాంచ్కైనా వెళ్లి నగదు మార్చుకోవచ్చన్నారు. ఈ షరతు కేవలం ఈ ఒక్క శనివారానికే పరిమితమని ఆయన స్పష్టం చేశారు.